కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల ధరలు నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నాయి. ఈ నేఫథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంజక్షన్లు తయారు చేస్తున్న ఏడు కంపెనీల ధరలను నిర్ణయిస్తూ చర్యలు తీసుకుంది.
Must Read ;- స్పుత్నిక్ వచ్చేస్తోంది : అనుమతులకు కేంద్రం ఓకే