బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ ‘ద గార్డియన్ ‘ దినపత్రిక నరేంద్ర మోడీని ఉతికి ఆరేసింది. రెండవ విడత కరోనా విజృంభణకు మోడీనే కారణమని కుండబద్దలు కొట్టింది. పాలనా వైపల్యాలను నిర్మొహమాటంగా కళ్ళకట్టెదుట నిలబెట్టింది. ‘‘ప్రధాని మోడీ అబద్దాల అతివిశ్వాసంతోనే భారతదేశంలో కరోనా విజృంభించింది. దేశం ‘కోవిడ్-19 క్రీడ ‘ ముగింపు దశలో ఉందని నరేంద్రమోడీ ప్రభుత్వం గత మార్చి చివర్నే ప్రకటించింది. కానీ, భారతదేశం ఇప్పుడు నరకాన్ని చవిచూస్తోంది. ఆసుప్రతుల్లో పడకలు ఖాళీలేవు. తగినన్ని ఆక్సీజన్ సిలిండర్లు లేవు. శ్మశానాల్లో ఖాళీ లేదు. శవాలు కుళ్ళిపోతున్నాయి’’ అని మోడీపై మీడియా మండిపడింది.
రిజైన్ పీఎం మోడీ
కరోనా కట్టడి చేయడంలో నరేంద్ర మోడీ విఫలమయ్యాడని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో ‘రిజైన్ పీఎం మోడీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రోల్ చేస్తున్నారు. దేశంలోని యువత, ఉద్యోగులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ప్రపంచంలోనే రెండో ట్రెండింగ్ లో ఉంది.
Must Read ;- భారత్కి ప్రపంచ దేశాల బాసట.. చైనా వక్రబుద్ధి