పుట్టుకుతోనే మస్తిష్క పక్షవాతంతో జైన్ నాదేళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల( 26 ) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఆయన కన్నుమూశాడు. జైన్ మరణ వార్తను సత్య నాదెళ్ల ఈ – మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సత్య నాదెంళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది మైక్రోసాఫ్. అయితే పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతం ( సెరెబ్రల్ పాల్టీ ) తో బాధపడుతున్నాడు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్ ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను ఆయన చేసే సేవ కార్యక్రమాల్లో వివరించేవారు సత్య నాదెళ్ల.