సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కోసూరి అమర్నాథ్ మరణించారు. కరోనాతో బాధపడుతూ ఆయన, కొద్దిరోజుల క్రితమే నిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అమర్నాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మంత్రి కేటీఆర్లు సంతాపం వ్యక్తం చేశారు. అమర్నాథ్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే సంతాపం తెలిపింది. అమర్నాథ్ అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో జర్నలిస్టులు కొవిడ్ బారిన పడుతున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు జర్నలిస్టులు మరణించినట్లు సమాచారం.
Must Read ;- తెలుగు పాటలకు వెలుగులద్దిన హాసం రాజా ఇకలేరు