తెలంగాణ ఐటీ శాఖమంత్రి కె.రామారావు ఈ రోజు వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఓరుగల్లులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వరంగల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవం చేసేందుకు మంత్రి కేటీఆర్ బయలు దేరారు. ఈ క్రమంలో పోచం మైదానం వద్ద కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు బీజేపీ అనుబంధ సంఘమైన ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి తోపులాటకు దారి తీసింది. ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Must Read ;- నిరుద్యోగి సునీల్ కన్నుమూశాడు : పదిరోజుల క్రితమే సెల్ఫీ వీడియో