విభిన్న తరహా కథలకు, విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు శర్వానంద్. కొంతకాలంగా శర్వా సక్సెస్ సాధించడంలో తడబడుతున్నప్పటికీ.. తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. వైవిధ్యతకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ.. తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ .. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో సిద్ధార్ధ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు. అలాగే.. మరికొన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో శర్వనంద్ మళ్ళీ పోలీస్ యూనిఫామ్ తొడగబోతున్నాడని వినికిడి.
‘రాధ’ సినిమాలో తొలి సారిగా పోలీస్ గా నటించిన శర్వానంద్ .. ఆ పాత్రను కామెడీ గా ప్రెజెంట్ చేశాడు. కానీ ఈ సారి పూర్తి స్థాయిలో సీరియస్ పోలీస్ గా నటిస్తున్నాడట. ఈ సినిమాతో కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. యాక్షన్ అండ్ ఎమోషనల్ వేలో శర్వానంద్ పోలీస్ పాత్ర ఉంటుందట. ఇలాంటి పాత్రలు పోషించడంలో మంచి ప్రతిభ చూపించే అతడు.. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు. త్వరలోనే సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అప్పుడే తెలుస్తాయి. మరి పోలీస్ గా శర్వానంద్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి.
Must Read ;- ఫస్ట్ లుక్ : ‘మహాసముద్రం’ నుంచి మహా బ్యూటీ











