యంగ్ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ టు సినిమాలతో జోరు మీదున్నాడు. కొంతకాలంగా సరైన హిట్స్ లేని శర్వా.. ఇప్పుడు జాగ్రత్తగా అడుగులేయ బోతున్నాడు.మంచి మంచి కాన్సెప్స్ట్ ను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 11న ‘శ్రీకారం’ మూవీతో విజయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. అతడి లేటెస్ట్ మూవీ మహాసముద్రం ఫస్ట్ లుక్ విడుదలవగా.. మరో సినిమా ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాను త్వరలో మొదలుపెట్టబోతున్నాం అంటూ నిర్మాతలు ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రివీల్ చేశారు.
నేను శైలజ, చిత్రలహరి, రెడ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కిశోర్ తిరుమల .. ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమకథా చిత్రాలతో పాటు, కుటుంబ కథా చిత్రాల్ని పెర్ఫెక్ట్ గా డీల్ చేయగలిగే ఈ దర్శకుడు.. సరిగ్గా అలాంటి సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్న హీరో శర్వానంద్ తో ఈ సినిమా చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఫ్యామిలీ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ మీద సాగే ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నిజానికి ఈ సినిమాను విక్టరీ వెంకటేశ్ తో చేయాలనుకున్నాడు కిశోర్. కానీ ఎందుకనో ఆయనతో వర్కవుట్ కాలేదు. ఈ కథ శర్వాను బాగా ఇంప్రెస్ చేసిందట. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న అతడు.. ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.
Must Read ;- ట్రైలర్ టాక్: వ్యవసాయ రంగంలో మేలుజాతి కుర్రోడి కథ ‘శ్రీకారం’
Here's the Title Poster of our next #AadavaalluMeekuJohaarlu 🙏 with @ImSharwanand.Shoot starts soon ❤
Elated to work with you Sir 😇
Wish you a very Happy Birthday & great success ahead in all the upcoming projects#SreekaramOnMarch11th ❤️#HBDSharwanand pic.twitter.com/GVvEq7XIaN
— Tirumala Kishore (@DirKishoreOffl) March 6, 2021











