బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రా దంపతులకు ఇప్పటికే 7 సంవత్సరాల కుమారుడు వియాన్ ఉన్నారు. ఈ దంపతులకు రెండో బిడ్డ సమీషా 2020 ఫిబ్రవరి 15న జన్మించింది. అయితే.. సరోగసి ద్వారా ఈ బిడ్డ పుట్టింది. అయితే.. ఐదు సంవత్సరాల నుంచి రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తే.. ఆఖరికి ఆ దేవుడి దయ వల్ల సమీషా పుట్టింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను శిల్పాశెట్టి తెలియచేశారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. తన కుమారుడు వియాన్ కి తోడుగా మరో బిడ్డ కావాలనుకున్నారట.
అయితే.. ఆమె APLA అనే ఆటో-ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుండడం వలన ఆమె గర్భవతి అయిన ప్రతిసారీ గర్భస్రావాలు జరిగాయట. వియాన్ ఒంటరి బిడ్డగా ఎదగడం ఇష్టం లేకపోవడంతో.. ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే.. మిషనరీ మూసివేయడంతో అది జరగలేదు. ‘దాదాపు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశాం. ఆఖరికి సరోగసి మార్గాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల మాకు పాపు పుట్టింది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది శిల్పా శెట్టి. ఈ ఆనందాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా శిల్పాశెట్టి తెలియచేస్తూ.. తన ముద్దుల కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది.
‘మా ప్రార్థనలకు సమాధానం ఈ అద్భుతం. మా పాప రాక మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. పాప పేరు సమీషా శెట్టి కుంద్రా. జూనియర్ ఎస్ఎస్ కె’ అని పరిచయం చేసింది. అంతే కాకుండా సమీషా పేరులో ఉన్న అర్థం ఏంటో కూడా చెప్పింది. సంస్కృతంలో సా ’అంటే పొందింది అని అర్థం. రష్యన్ భాషలో మిషా అంటే దేవుడితో సమానం అని అర్ధం అని చెప్పింది. ఈ పాప సంవత్సరం పూర్తి చేసుకుంది. ఫస్ట్ బర్త్ డే సందర్భంగా సమీషా ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు.
Must Read ;- సోషల్ మీడియా ‘బుట్టబొమ్మ’గా సితరకే పట్టం











