ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం కలకలం రేపింది. హైదారాబాద్ బంజారాహిల్స్ లో తన ఇంట్లో ఉన్న సూరీడిపై అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, క్రికెట్ బ్యాట్ తో దాడి చేసినట్లు కూతురు గంగా భవాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొన్నేళ్ల క్రితం కూతురు గంగా భవాని, అల్లుడు సురేంద్రనాథ్ మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. వేధింపులు ఎక్కువ కావడంతో కూతురు గంగా భవాని పుట్టింటికి వెళ్లారు. వేధింపులు భరించలేక భర్తపై కేసు పెట్టారు. పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని భార్య భవాని, మామ సూరీడిపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చాడు. బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. అయితే వాళ్లిద్దరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కక్ష పెంచుకున్న సరేంద్రనాథ్ సూరీడీపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Must Read ;- వివేకా వర్ధంతికి జగన్ దూరం.. సీబీఐ విచారణే కారణమా..?