గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనుసూద్ నిర్విరామంగా సహాయలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో.. నిరుపేదలకు కష్టాలు లేకుండా చేస్తున్నాడు. ఎవరైనా సరే.. ఎక్కడ నుంచైనా సరే.. కష్టాల్లో ఉన్నాను అని చెబితే చాలు.. నేనున్నాను అంటూ ముందుకొస్తున్నాడు. వాళ్ల కష్టాలను తీరుస్తున్నాడు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ సహాయాల సంఖ్య మరింత ఎక్కువగా మారింది. మనుషుల్లో దేవుడు అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకువచ్చేది సోనూసూదే.
సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే ఈమధ్య ఆక్సిజన్ ప్లాంట్స్ ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతో మందికి ఊపిరి పోశాడు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్థనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఫ్రీ ఎడ్యుకేషన్. సీఏ కోర్స్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. అయితే.. ఎవరైనా సీఏ చేయాలనుకుంటే.. వాళ్లు డబ్బులు లేక ఎలా చేయాలని ఆలోచిస్తుంటే.. అలాంటి వారికి నేనున్నాను అంటున్నారు సోనూసూద్.
ఫ్రీ సీఏ ఎడ్యుకేషన్ పేరుతో సోనుసూద్ ముందుకొచ్చారు. ఫ్రీ సీఏ కోచింగ్ తో పాటు ఇంటర్నషిప్, అలాగే ప్లేస్ మెంట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సూద్ ఛారిటీ ఫౌండేషన్ లో రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ల సీఏ కోర్స్ ను ఫ్రీ గా చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ నుంచి కష్టాల్లో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న సోనూసూద్ ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుండడంతో పలువురు సోనూసూద్ ను అభినందిస్తున్నారు.