కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువులో దారుణం చోటు చేసుకుంది. చింతలచెరువుకి చెందిన డిగ్రీ విద్యార్థిని శిరీషపై చరణ్ అనే యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శిరీషపై కత్తితో దాడికి తెగబడ్డాడు. శిరీషను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దాడి తరవాత చరణ్ కూడా కత్తితో పొడుచుకోవడంతో అతనికి కూడా గాయాలయ్యాయి. అతన్ని బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Must Read ;- టీడీపీ నుంచి పోటీచేసినందుకు దాడి,అక్రమ కేసు.. పోలీస్ స్టేషన్ ఎదుట గర్భణి ఆందోళన











