(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అనుకున్నది ఒక్కటి .. అయినది ఒక్కటి.. అన్నట్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ వ్యవహారం చివరకు అతని మెడకే చుట్టుకుంది. విశాఖ ఉక్కు ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పిస్తున్నట్టు సూసైడ్ లేఖ రాసి అదృశ్యమైన శ్రీనివాస్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోగా… ఉద్యాగాలిప్పిస్తానంటూ ఆయన నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
పోలీసుల గాలింపు
స్టీల్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఎస్ .శ్రీనివాస్ అనే ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయారు. ఐడి కార్డు, పర్సు, సెల్ఫోన్ విడిచిపెట్టి నిన్న రాత్రి వీధుల్లోకి వచ్చిన ఆయన సి షిఫ్ట్ ముగించుకొని అదృశ్యం కావడంతో అతడి గురించి గాలిస్తున్నారు.
ఆ లేఖలో ఏముందంటే..
“ ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు furnace లో అగ్నికి ఆహుతి కావడానికి ఉదయం 5.49 గంటలకు మూహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి. అని లాగ్ లాగ్ బుక్ లో రాశాడు.
సుమారు రెండు కోట్ల వసూలు ..
ఇతగాడు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ.2కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.శ్రీనివాస్ ఆత్మహత్య ఉత్తరం కలకలం రేపడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే అతను అదృశ్యం అయ్యాడు అన్న విషయం తెలుసుకొని ఉద్యోగాల కోసం డబ్బులు సమర్పించుకున్న బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కె. శ్రీనివాసరావు బాధితుల సంఖ్య పెద్దదే ఉంది.
కాల్ డేటా సేకరణ
ఆత్మహత్య లేఖతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడి కాల్ డేటాను సేకరించారు. చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఎవరికి ఫోన్ చేశాడు? ఏ పని నిమిత్తం మాట్లాడారు? ఇలాంటి అన్ని విషయాలు సేకరించిన పోలీసులకు ఇందులో అత్యధికులు బాధితులుగా తేలింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి శ్రీనివాసరావు సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అంశం బయటకు రావడంతో పోలీసులను మరికొంత మంది బాధితులు ఆశ్రయిస్తున్నడంతో ఇప్పటి వరకు సుమారు రూ.2కోట్ల వరకు శ్రీనివాసరావు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా దర్యాప్తులో తేలింది.
సైలెంట్గా ఉంటే..
శ్రీనివాసరావు సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయి ఉంటే బహుశా ఈ వ్యవహారం ఇప్పట్లో వెలుగులోకి వచ్చేది కాదేమో!. ఉద్యమంలో హీరోలా నిలవాలని చేసిన ప్రయత్నం చివరకు అతడి మెడకు చుట్టుకున్నట్టు అయింది. లేదా బాధితుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు పథకం ప్రకారమే ఇలా చేశాడా? అన్నది ఆయన పట్టుబడితేనే అసలు నిజం బయట పడుతుంది.
Must Read ;- రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి విశాఖ స్టీల్ ప్లాంట్?











