ఇక అప్పులు పెట్టం .. బకాయిలు చెల్లించండి!
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోంది. గడిచిన రెండునరేళ్లల్లో ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీంటి భ్రష్టుపట్టిపోయాయి. ప్రస్తుతం ఆరోగ్య శాఖ వంతు వచ్చింది. ఏపీ ఆరోగ్య శాఖ కు వైద్య పరికరాలను అందించే కంపెనీలను వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ ( ఏఐఎండీఈడీ ) హెచ్చరించింది. ఏ కంపెనీలు వైద్య పరికరాలను సరఫరా చేయ్యొద్దని తన అధికార వెబ్ సైట్ లో ‘రెడ్ నోటీస్’ జారీ చేసింది. జాతీయ స్థాయిలో ఏపీకి వైద్య పరికరాలను సరఫరా చేసే కంపెనీలు అత్యంత జాగ్రత్తలను వహించాలని సూచనలను కూడా చేసింది. ప్రస్తుతం ఏఐఎండీఈడీ చేసిన హెచ్చరికలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, వైద్య పరికరాలు సరఫరా దారులకు ఇప్పటికే వేల కోట్లు రూపాయాలు బకాయి పడింది. అంతేకాక వైద్యశాలలకు మందులు, వైద్య, సర్జికల్ పరికరాలు వంటివి సరఫరా చేసే కంపెనీలకు కూడా ఏళ్లు గడుస్తున్న బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆయా కంపెనీలు జాతీయ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులకు స్పందించిన అసోసియేషన్ బహిరంగంగానే స్పందించింది. తన అధికార వెబ్సైట్ లో ‘రెడ్ నోటీసు పోస్టర్’ను విడుదల చేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండిస్ట్రీ మెంబర్లు అందరికీ హెచ్చరిక .. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్పమెంట్ కార్పోరేషన్ ( ఏపీఎంఎస్ఐడీసీ ) ఆహ్వానించే పనుల్లో బిడ్లు దాఖలు చేయవద్దు .. వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు .. కంపెనీలకు వందశాతం అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే యూనియన్ మెంబర్లు పరికరాలను సరఫరా చేయండి అని ఆ ‘రెడ్ నోటీస్’ సారాంశం!
వేల కోట్లల్లో బకాయిలు .. తక్షణమే చెల్లించండి!
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్పమెంట్ కార్పోరేషన్ ( ఏపీఎంఎస్ఐడీసీ ) కు గత నెలలో ‘ఏఐఎండీఈడీ’లేఖ రాసింది. తమ యూనియన్ కు చెందిన కంపెనీలకు వేల కోట్లల్లో బిల్లులు బకాయిపడ్డారు, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. అలా చేయకుంటే యూనియన్ లో మెంబర్లుగా ఉన్నవారిని టెండర్లలో పాల్గొనకుండా రెడ్ నోటీస్ ఇస్తామని కూడా ఘాటుగానే హెచ్చరించింది. ‘ఏఐఎండీఈడీ’యూనియన్ లో సుమారు 500 కంపెనీలకు మెంబర్షిప్ ఉంది. గత ఎనిమిది నెలల వ్యవధిలో ‘ఏపీఎంఎస్ఐడీసీ’దాదాపు రూ.800 కోట్లకు పైగా కంపెలకు బకాయి పడింది. కొవిడ్ సమయంలో సరఫరా చేసిన కంపెనీలకు మరో రూ.329 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలానే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కొనుగోలు చేసిన వాటికి మరో రూ. 54 కోట్లు మేరకు పెండింగ్ బిల్లులున్నాయి. ఇలా ‘ఏపీఐఎంస్ఐడీసీ’ వేల కోట్ల అప్పుల్లోకి కూరకుపోయింది. బిల్లులు సకాలం చెల్లిస్తారని నమ్మి వైద్య పరికరాలను సరఫరా చేసి మోసపోయామని సంస్థలు వాపోతున్నాయి.‘ఏఐఎండీఈడీ’చర్యతో ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏ పాటిదో జాతీయ స్థాయిలో అందిరికీ అర్థమైంది. చివరికి ప్రభుత్వ పరువేకాదు, రాష్ట్రపరువు కూడా దిగజార్చడని జగన్ రెడ్డి వైఖరిపై నిపుణులు, ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!











