ఆశయాలను అంధకారంలో నెట్టివేస్తున్న అలివికాని అప్పులు!
ఆదాయం వనరులపై దృష్టిపెట్టకుండా సంక్షేమ పథకాలంటూ .. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన అసమర్థుడు జగన్ రెడ్డి అని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ( పీఎఫ్సీ) తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన గట్టి పంచ్ విస్మయానికి గురిచేస్తోంది. వివిధ పథకాల అమలు కోసం తమవద్ద తీసుకున్న రుణాన్ని తక్షణమే చెల్లించాలని అల్టీమేటం జారీ చేసింది. మీకిచ్చిన కాలపరిమితి అయినపోతున్న నేపథ్యం వెంటనే తీసుకున్న రూ.2,000 కోట్లను తిరిగి చెల్లించాలని సూచించిది. అలా కానీ పక్షంలో ఏపీ ప్రభుత్వాన్ని డిఫాల్టర్( మెండి బకాయిల) జాబితా పెడతామని హెచ్చరించింది. అలా జరిగితే దేశంలో ఏ బ్యాంకులు రుణమివ్వడానికి మందుకు రావు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ల్ అన్ని నిలిచిపోతాయి. దీంతో ఏ బ్యాంకు అప్పులు ఇవ్వడానికి విముఖత చూపి వెనకడుగు వేస్తే.. రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో ఊహించుకోవడానికే భయమేస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపి రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ వ్యవహారం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడంతో అప్పులివ్వడానికి బ్యాంకులు పూర్తిగా విముఖత చూపుతున్నాయన్నది అక్షర సత్యం.
డిఫాల్టర్ గా ప్రకటిస్తే … ఇక అప్పులు పుట్టవ్!
కేంద్ర పవర్ ఫైనాస్ కార్పోరేషన్ ఏపి ప్రభుత్వాన్ని డిఫాల్టర్ లిస్ట్ లో పెడితే .. కొత్తగా ఏ బ్యాంకు నుంచి అప్పులు పుట్టవు. దీంతో కొత్త అప్పులు పుట్టకపోవడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు నిలలిచిపోతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి అసమర్థపాలనకు బెంబెలెత్తిపోతున్న ప్రపంచబ్యాంకు మీ వైకరి మార్చుకొకుంటే నిధలు ఆపేసి, కేంద్రంతో తెల్చుకుంటామని హెచ్చరించింది. మరోపక్క ఏఐఐబి( ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ) కూడా అందించాల్సిన ఆర్థిక రుణ తోడ్పాటు ఇవ్వమని చెప్పడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఇవిలా ఉంటే తాజాగా పవర్ ఫైనాస్ కార్పోరేషన్ కూడా డిఫాల్టర్ గా ప్రకటిస్తామని హెచ్చరించడంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఉంది. పీఎఫ్సీకి బకాయిపడ్డ రూ. 2,000 కోట్ల అప్పును తక్షణమే చెల్లించాలని డెడ్ లైన్ పెట్టింది. అలా జరగకుండా ఏపి ప్రభుత్వాన్ని మొండి బకాయిల జాబితా చేర్చుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
పద్దతి మార్చుకోకుంటే మడతడిపొద్ది ..!
అప్పులు తెచ్చుకోడవమే కాదు.. తిరిగి చెల్లించే విధానాలను అనుసరించాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ ఆ విధానాలను పాటించలేదన్నదే బ్యాంకులు ఆరోపిస్తున్న అంశాలు. కేంద్ర ప్రభుత్వం పరిథిలోని పవన్ ఫైనాస్ కార్పోరేషన్ ( పిఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్( ఆర్ఈసీ) సంస్థలు దేశంలో విద్యుత్ రంగానికి అప్పులిస్తుంటాయి. విద్యుత్ శాఖ పరిధిలోని సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, భవనాలు, భూములు, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టుకుని అప్పులిస్తుంటాయి. ఈ అప్పులు చెల్లించడానికి గడువు ఇస్తోంది. అలా గడువు ప్రకారం చెల్లించకపోతే డిఫాల్ట్ అయినట్లు భావించి ఆ బకాయిలని మొండి బకాయిగా ప్రకటిస్తాయి. ఏ రాష్ట్రమైన ఇటువంటి దౌర్భగ్య పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతాయి. ప్రతినెల రూ.6,000 కోట్లు అప్పలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, చేసిన అప్పులు చాలక వచ్చే ఆదాయం కూడా అప్పులు తీర్చడానికే సరిపెడుతున్నారని ఆర్థిక రంగ నిపుణులు విచారం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3న కేంద్రం ప్రభుత్వం రూ.10,500 కోట్ల అప్పుకు అనుమతులివ్వగా .. నాటి నుంచి నవంబర్ 2 నాటికి ఈ మొత్తాన్ని అవిరిచేశారు. మూలధన వ్యయంలో కేంద్రం సూచించిన మేరకు ఖర్చు చేసినందుకు అదనంగా మరో రూ. 2,650 కోట్లు కొత్త అప్పునకు అనుమతించింది. అన్నింటికి వీటినే వాడగా ..ఇక మిగిలింది కేవలం రూ. 2,150 కోట్లే. వీటిని కూడా ప్రస్తుతం పవర్ ఫైనాస్ కార్పోరేషన్ విధించిన డెడ్ లైన్ కు లోబడి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కడితే .. రాష్ట్రం వద్ద మిగిలేవి రూ.150 కోట్లే మాత్రమే. వీటితోనే నవంబర్ మాసం 22 రోజులు, డిసెంబర్ లోని నెలరోజులను ఎలా గడపలో అర్థకావడంలేదని ఆర్థిక శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Mustv Read ;- రాజధాని రైతులకు వెల్లువలా మద్దతు











