హోం క్వారంటైన్ లో చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనును కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే! ఈ విషయాన్ని లోకేష్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్తగా కోవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు. మరో వైపు ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలను మూసివేయాలని విపక్షాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా వేళ కేసులు అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి.










