తెలంగాణలోని పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను తెలంగాణ సీఎస్ సోమేష్కుమార్ జారీ చేశారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్గా ఉన్న పి.వెంకట్రామిరెడ్డిని సంగారెడ్డి జిల్లాకు గత నెలలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో ఆయనను తిరిగి సిద్ధిపేట జిలాకు మళ్లీ నియమించారు. మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికలకు ముందు సంగారెడ్డి కలెక్టర్ ఎం. హన్మంతరావు మెదక్ జిల్లా కలెక్టర్గా వెళ్లారు. ఇప్పుడు ఆయనను మెదక్ నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. అలాగే ఎన్నికల ముందు మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికెరీ సిద్ధిపేట కలెక్టర్గా అప్పట్లో బదిలీ చేశారు. అయితే హోలికేరీని మళ్లీ బాధ్యతలు కట్టబెడుతూ మంచిర్యాల జిల్లాకే బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిక్తా పట్నాయక్ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. అలాగే పెద్దపల్లి కలెక్టర్గా అదనపు బాధతల నుంచి శశాంకను కూడా రిలీవ్ చేశారు. ఈ స్థానంలో హోళికేరీకి అదరనపు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్ను బదిలీ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న శ్వేతా మహంతికి మేడ్చల్ జిల్లా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.