అన్నీ సర్ధుకుంటున్తున్నాయి అనుకున్న వేళ జగన్ సర్కార్ కి మరో ఎదురుదెబ్బ తగిలిందా ? ఏకంగా తన ప్రభుత్వంలోని అధికారులే ప్రభుత్వాధినేతకు ఊహించని షాక్ ఇచ్చారా ? బకాయిలు చెల్లించకుంటే మీకు ఏర్పాట్లు చేయడాని సిద్ధంగా లేమనటున్న ఆ అధికారులు ఎవరు ? ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారిన ఆ శాఖ ఏది ? ఇంతకీ వారి విషయంలో ప్రభుత్వం చేసిన తప్పిదం ఏమిటి ?
ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా శాఖ తాజాగా రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని , లేని పక్షంలో సిఎం సహా విఐపిలు అందరికీ తమ సేవలను నిలిపిస్తాం అంటూ రవాణా శాఖ ఆ లేఖలో పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర విఐపిలకు కాన్వాయ్ లు సమీకరించే బాధ్యత రాష్ట్ర రవాణా శాఖదే..రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు పర్యటనలు ఏ జిల్లాలో జరిగినా స్థానిక రవాణా శాఖ అధికారుల పై వాహనాలు సమకూర్చే బాధ్యత ఉంటుంది. వారు వారిగి ఉన్న పరపతి ఆధారంగా వాహనాలను సమకూరుస్తార, అనంతరం బిల్లులు మంజూరు అయ్యాక వాటిని ఆయా వాహనాలా యజమానులకు చెల్లిస్తారు. ఇది అనాధిగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ క్రమంలోనే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా, అంటే గడిచిన మూడేళ్ళుగా సంబంధిత శాఖ ఆ ఏర్పాట్లను ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తూనే ఉంది. ఈ క్రమంలో సదరు కాన్వాయ్ ల ఖర్చులు అక్షరాలా 17.50 కోట్లకు చేరుకున్నాయి. కాగా ఈ ఖర్చులను సంబంధిత శాఖకు ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉండగా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, అంటే మూడేళ్లుగా ఈ ఖర్చులను రవాణా శాఖకు ఏపీ ప్రభుత్వం చెల్లించనే లేదట.ఫలితంగా ఈ బకాయిలు అలాగే పేరుకుపోయాయట.
ఇదిలా ఉంటే, వీటి కోసం తాజాగా ఏపీ రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆ లేఖలో కోరింది. అంతేకాకుండా తక్షణమే బకాయిలు చెల్లించకుంటే… సీఎం సహా వీఐపీలకు ఇకపై కాన్వాయ్లను ఏర్పాటు చేయలేమంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
నిజానికి రవాణా శాఖ పని కేవలం కాన్వాయ్ లకు వాహనాలను సమీకరించడమే. బిల్లుల చెల్లింపులు వ్యవహారం మొత్తం జిఏడి నుంచి ప్రోటోకాల్ విభాగం చూసుకుంటుంది. అయితే బిల్లులు చెల్లించకపోవడంతో గత కొంత కాలంగా రవాణా శాఖకు వాహనాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు ప్రోటోకాల్ విభాగానికి తెలియజేసినప్పటికీ సరైన స్పందన మాత్రం రాలేదట. దీంతో ఏం చేయాలో పాలుపోని రవాణా శాఖ బిల్లులు తక్షణమే చెల్లించకపోతే ఇక పై వాహనాలు సమీకరించడం తమతో కాదని తేల్చి చెప్పేసిందట.
ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదని అనేక విమర్శలు జగన్ సర్కార్ ఎదుర్కొంటున్న సమయంలో రవాణా శాఖ రాసిన ఈ లేఖ అవి విమర్శలు కావు నిజమే అని తేల్చేస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.