గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా? అనే ప్రశ్న ఎప్పట్నుంచో ఉన్నదే. తాజాగా మళ్లీ ఈ అంశం వార్తల్లోకి ఎక్కింది. గ్రహాంతర వాసులు(ఎలియన్స్) ఉన్నమాట నిజమేనని ఇజ్రాయిల్ మాజీ అంతరిక్ష చీఫ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి కూడా ఈ గ్రహాంతర వాసులకు తెలుసని ఆయన చెప్పారు. ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద సంచలనమే అయ్యింది. ఇజ్రాయిల్ అంతరిక్ష భద్రతా కార్యక్రమానికి నేతృత్వం వహించిన 87 ఏళ్ల హైమ్ ఎషెడ్ ప్రకటించిన వివరాల ప్రకారం ఎలియన్స్ ఇప్పటికే అమెరికాతోనూ, ఇజ్రాయిల్ తోనూ రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారట.
దీన్ని జీర్ణించుకోడానికి మానవజాతి సిద్ధంగా లేదు కాబట్టి ఈ గ్రహాంతర వాసుల ఉనికి గురించి బహిరంగ పర్చడం లేదట. అసలు ఈ గ్రహాంతర వాసులందరికీ గెలాక్సీ ఫెడరేషన్ అనేది ఉందట. వీరిందరికీ అమెరికా సహకారంతో అంగారక గ్రహంపై ఓ రహస్య భూగర్భ స్థావరం కూడా ఉందట. ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యంగా లేదూ. ఈ విషయాన్ని బహిరంగ పర్చడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారట. కాకపోతే గ్రహాంతర వాసులు ఆయనకు అనుమతి ఇవ్వడం లేదట. ఇంకా కొంత కాలం వెయిట్ చేయండి అంటున్నాట.
దీనివల్ల మాస్ హిస్టీరియా తలెత్తే ప్రమాదముందని హెచ్చిరిస్తున్నారట. ముందుగా దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా వారు కోరుకుంటున్నారట. ఆ ఇజ్రాయిల్ మాజీ అధికారి చెప్పే వివరాల ప్రకారం చూస్తే అసలు గ్రహాంతరవాసులు చాలా కాలం నుంచే మన మధ్య ఉన్నారంటున్నారు. ఆయన చెప్పే మాటల్లో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ అంశం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Must Read ;- కాలంలోకి ప్రయాణం.. టైమ్ మెషీన్ 360