ఆయనో దేశాధ్యక్షుడు… దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయిల్ దేశానికి ప్రధమ పౌరుడు. ప్రజలకు దిశా నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి. అలాంటి దేశాధ్యక్ష పదివిలో ఉండి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అటు ఇంటిని, ఇటు ఆఫీస్ పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో మహిళలను మించిన వారు లేరు. దేశాధ్యక్షులు గా సైతం రానిస్తూ తమ సత్తా చాటుతున్నారు. అటువంటి ఆధునీక కాలంలో, ‘ఆడవారు హక్కులు కలిగిన పశువులు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎవడో అనామకుడు అంటే బహుశా ఎవరు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక దేశాధ్యక్షుడే ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేస్తే, నివ్వెరపోవడం ప్రపంచం వంతైంది. ఎలాంటి సందర్భం లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సరే అది క్షమించరాని నేరం.
ఏమిటా సందర్భం?
ఈ మాటలను బెంజమిన్ నెతాన్యహు ఏ సందర్భం లో అన్నాడో తెలుసుకుంటే మరింత కోపం వస్తుంది ఎవరికైనా. ‘అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేఖ దినోత్సవం’ సందర్భంగా గృహ నిర్భంధం, గృహ హింస గురించి వ్యాఖ్యానిస్తూ అన్న మాటలివి. ‘హింసించడానికి ఆడవారు పశువులా, నేటి కాలంలో పశువుల్ని కూడా కొట్టద్దని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. మహిళలకు, పశువులకు ఒక పోలిక ఉంది. ఆడవాళ్లు, పిల్లలు కూడా పశువులే, కాకపోతే హక్కులు కలిగిన పశువులు’ అంటూ మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. అసలేం మాట్లాడుతున్నాడో అర్థం కాక అక్కడి వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది.
Must Read ;- మోసపోయిన తెలుగు మహిళలు.. ఆదుకున్న దుబాయ్ తెలుగుదేశం నాయకులు
Netanyahu at event marking International Day for the Elimination of Violence against Women: “A woman isn't an animal you can beat, & nowadays we say don’t hit animals. We have compassion for animals, women are animals, children are animals, with rights.” pic.twitter.com/jwfLH6aYqU
— Noga Tarnopolsky (@NTarnopolsky) November 23, 2020
ఆ దేశ మహిళలు దుస్థితి తెలియజేశాడు
మామూలుగా ఎవరైనా ఆడవారిని కించపరిస్తే, ఏం మాట్లాడుతున్నావు అంటూ వారికి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కానీ, ఒక దేశాధ్యక్షుడే ఇలాంటి అనాగరిక వ్యాఖ్యలు చేస్తే, వారు ప్రపంచానికి అందిస్తున్న సందేశం ఏమిటి? అసలు ఆ దేశ మహిళల దుస్ధితి ఎలా ఉందనేది ఈ ఒక్క మాటతో తెలుస్తుంది. ఆ దేశంలో ఆడవారికి ఏ మాత్రం విలువ, గౌరవం ఉన్నాయో చెప్పకనే తన వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దేశంలో ఆడవారి పట్ల హింస ఎలా పేట్రేగిపోతుందో తన వ్యాఖ్యలతో ప్రపంచానికి వివరించాడీ అధ్యక్షుడు.
జాలేస్తుంది
నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని చూస్తుంటే జాలేస్తుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి ఉద్భవించేది ఆడవారి గర్భం నుండే. మానవజాతి అందుకు అతీతం కాదు. మరి ఆడవారు పశువులైతే, ప్రపంచంలో మానవజాతి అనేదే లేదనేది అర్థం. ఆఖరికి, ఆడవారిని పశువులతో పోల్చిన గౌరవనీయ దేశాధ్యక్షులు సైతం తల్లి గర్భం నుండే పుట్టారనే విషయం మరిస్తే ఎలా? తెలియక మాట్లాడిన వారికి తెలియజేయచ్చు. కానీ, ఇలా అంతా తెలిసుననుకుని దేశ ప్రతినిధి హోదా పొంది నేడు ఆడవారిని, చివరికి తన తల్లిని సైతం పశువులతో పోల్చిన వ్యక్తిని అనడానికి కొత్త పదాలు వెతకాలి.
Also Read ;- రెడ్డన్న బెదిరింపు..