(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజుపై అసత్య ఆరోపణలతో కూడిన ప్రచారం జరుగుతోందని, కార్పొరేషన్ ఎన్నికల వేళ కావాలనే ఒక రాజకీయ పార్టీ బురద జల్లే కార్యక్రమం చేపట్టిందని టీడీపీ వర్గాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దాల నాగకుమారి తరపున సోమవారం పూసపాటి అశోక్ గజపతిరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రచారానికి వచ్చే సమయానికి అభిమానులు పెద్దసంఖ్యలో గుమిగూడారు.

అందులో ఒక మహిళాభిమాని అశోకగజపతి రాజుపై పూలు జల్లుతూ .. హారతి ఇచ్చేందుకు ప్రయత్నించారు. హారతి మంట పెద్ద ఎత్తున రావడం గమనించిన అశోకగజపతి రాజు ఆ పల్లాన్ని చేతితో కొట్టి కింద పడగొట్టారు. మంట వ్యాప్తి చెందకుండా నివారించారు. ఇదే అదునుగా కొంతమంది వ్యక్తులు అశోకగజపతి రాజు .. హారతిని ఇస్తూ పువ్వులను జల్లిన మహిళపై చేయిచేసుకున్నారని ప్రచారం చేయడం .. మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెనువెంటనే తెలుగుదేశం వర్గాలు స్పందించి .. ఆ వార్త వాస్తవ విరుద్ధమని ఖండించాయి. ఆ మహిళతో వివరణ ఇప్పించాయి. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
Must Read ;- చంద్రబాబు హెచ్చరిక : రౌడీలకే రౌడీని నేను…ఖబడ్దార్ పెద్దిరెడ్డి తేల్చుకుందాం రండి











