సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ కోసం ఎప్పటి నుంచో సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ సంచలన చిత్రాన్ని డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో ఉండే యాక్షన్ స్టోరీ అని.. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉంటుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమా నిర్మాణంలోకి దిల్ రాజు కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ఈ సినిమాని ప్రపంచ భాషలు అన్నింటిలో రూపొందించాలి అనుకుంటున్నారట. ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్ లో ఉంటుందట. అది కూడా బాండ్ సినిమాల తరహాలో వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. అయిదారు వందల కోట్లు వుంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ భారీ ప్రాజెక్టులోకి కేఎల్ నారాయణతో పాటు మరో నిర్మాతను జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
పైగా ప్రొడక్షన్ పూర్తిగా చూసుకోవాలి. దానికి చాలా వ్యయ ప్రయాసలు ఉంటాయి. అలాగే నిర్మాత కేఎల్ నారాయణ ప్రొడక్షన్ చేసి చాలా కాలం అయింది. అందుకే నిర్మాత దిల్ రాజును ఈ ప్రాజెక్టులో జాయిన్ చేస్తారని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఎలాగూ భవిష్యత్తులో ఆ సినిమా రైట్స్ కోసం వంద కోట్లకు పైగా దిల్ రాజు పెట్టుబడి పెట్టాలి. దానికి బదులు నిర్మాణంలో భాగస్వామి అయితే ఇంకా బెటర్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారని సమాచారం.
Must Read ;- పునీత్ పార్థివ దేహం వద్ద తెలుగు హీరోల నివాళులు