టాలీవుడ్ లో శేఖర్ కమ్ములకి సెన్సిబుల్ డైరెక్టర్ అని పేరు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథల్ని వండి వార్చడంలో ఆయన సిద్ధహస్తుడు. ఎర్లియర్ గా ‘ఫిదా’తో అద్భుతమైన ఎమోషన్స్ పండించి.. సూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జోడీతో ‘లవ్ స్టోరీ’ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత శేఖర్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయంలో అందరూ ఆసక్తిగా ఉన్నారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నారనే వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అలాగే.. శేఖర్ మరో మంచి లవ్ స్టోరీని కూడా లైన్ లో పెట్టబోతున్నారట. కథని బట్టే హీరోల సెలక్షన్ ఉంటుంది కాబట్టి.. ఆయన కథకు ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ చాలా యాప్ట్ అని భావిస్తున్నారట. అలాగే.. ఇందులో నానీ గ్యాంగ్ లీడర్ భామ.. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుందట. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఉప్పెనతో అవలీలగా రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరిన వైష్ణవ్ తేజ హీరోగా .. ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి శేఖర్ కమ్ముల వైష్ణవ్ తేజ తో ఏ రేంజ్ సినిమా తీస్తాడో చూడాలి.