అమరావతి పోరాటం 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరగుపున్న జనభేరి కార్యక్రమంలో టీడీపీ నాయకులంతా అమరావతి గొప్పతనం గురించి తెలియజేస్తూనే.. నేటి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వంగవీటి రాధ మాట్లాడతూ.. రాజధాని కులానికి సంబంధించిన విషయం కాదని, కులమనే ముసుగును కప్పి అమరావతిని మరుగున పడేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అసలు రాజధాని వ్యవహారంలో కుల ప్రసక్తే లేదని రాధా చెప్పారు.
ఏపీని కులాలా వారిగా, మతాల వారిగా విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని రాధా చెప్పుకొచ్చారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. శ్రీసిటీ, రాయలసీమలో సోలార్ ప్లాంట్స్.. ఇలా అన్ని ప్రాంతాల వారీగా గత ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళిక చేసింది. కేవలం ఒక కులం మాత్రమే బాగుపడుతుందని చెప్పుకొస్తున్నారు. కానీ అలా మాట్లాడుతున్న వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నాను. ఒకసారి ఇక్కడ వేదికను చూస్తే ఎన్ని కులాలు ఉన్నాయో తెలుస్తుంది.
నా కులం ఏంటనేది అందరికీ తెలుసు. అనుమానం ఉంటే నా కులం చెక్ చేసుకోండి. నేను రంగా గారి అబ్బాయిని, కావాలంటే రికార్డల్లో నా కులం ధృవీకరించుకోవచ్చు. అప్పుడు ఏ కులంలో ఉన్నానో ఇప్పుడు అదే కులంలో ఉన్నాను. అదే కులంలో ఉంటూనే రాష్ట్రం కోసం పోరాడుతానని చెప్పుకొచ్చారు. ఏపీని మూడు ముక్కలు చేసి ప్రజలతో ఆడుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ఆటల్ని సాగనివ్వకూడదు. కులాలు, మతాలకతీతంగా ప్రజలంతా ఒక్కటై మన రాజధాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది.
అమరావతి కోసం నిరాహార దీక్షలు చేస్తున్నవారు ఏ కులం, మతంకు చెందిన వారో కూడా చూడండి అంటూ చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశ.. శ్వాస ఒకటే అది ‘అమరావతి’ అంటూ ఎంతో ఉద్విగ్నంగా మాట్లడారు.