వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. పెళ్లై.. పిల్లలున్నా ఓ మహిళ తన చిన్ననాటి ప్రేమికుడితో ప్రేమాయణం కొనసాగించింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి చంపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మధురవాడకు చెందిన రమ్య, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోనె సతీష్ ను 2015లో పెళ్లి చేసుకుంది. ఉద్యోగ రీత్యా ఇద్దరు దుబాయ్ వెళ్లారు. అక్కడ సుధాకర్ అనే వ్యక్తి కలిసి సతీష్ పలు వ్యాపారాలు చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చిన రమ్య మళ్లీ గర్భవతి అయింది. ప్రసవం కోసం విశాఖపట్నానికి వచ్చారు.
Vizag Wife Kills Husband :
ప్రియుడితో కలిసి చంపించింది
రమ్యకు చిన్ననాటి ప్రేమికుడు బాషా పరిచయమయ్యాడు. పెళ్లై, పిల్లలున్నా రమ్య అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త సతీష్ అడ్డుగా ఉన్నాడని భావించింది. ప్రియుడి సాయంతో చంపేందుకు కుట్ర పన్నింది. ఈనెల 13న విశాఖలో మార్నింగ్ వాక్ వెళ్లారు. ఆ సమయంలో బాషా ఇనుపరాడ్డుతో బలంగా కట్టి పారిపోయాడు. రమ్య కేకలు వేయడంతో, అక్కడున్నవారు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సతీష్ చనిపోయాడు. తన భర్త సతీష్, ఆయన స్నేహితుడు సుధాకర్ కు మధ్య గొడవలు ఉన్నాయని, అతనే మర్డర్ చేశాడని రమ్య పోలీసులకు తెలిపింది. అయితే రమ్య ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తనే ప్రియుడితో కలిసి భర్తను చంపించానని ఒప్పుకుంది. బాషా, రమ్యలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
Must Read ;- కుషీ తలకెక్కి వెళ్లగక్కారు.. పోలీసులకు పట్టుబడిన తాడేపల్లి అత్యాచారం నిందితులు?