ఏపీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరో లేఖ సంధించారు. నవ సూచనల పేరుతో రఘురామరాజు ఏడో లేఖ రాశారు. ఇందులో ఇసుక పాలసీ గురించి ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్కు అప్పగించాకే కొరత తీవ్రమైందని ఆరోపించారు. ఇసుక పాలసీ కారణంగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఘోరంగా పడిపోయాయన్నారు. మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని, హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల జోక్యం ఎక్కువైందని అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్లా ఒకే ధరకు ఇసుక హామీ అమలు కావడం రఘురామరాజు మండిపడ్డారు.
నిర్మాణ రంగం ఢమాల్
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ వల్ల నిర్మాణం రంగం ఘోరంగా పడిపోయిందని, ఇసుక పాలసీని మారిస్తే వెంటనే నిర్మాణం రంగం పుంజుకుంటుందని స్పష్టం చేశారు. తద్వారా పేదలకు కూడా ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. ఇసుక పాలసీని డిజిటలైజేషన్ చేసినప్పటికీ.. రాష్ర్టంలో అక్రమ ఇసుక దందా ఎందుకు నడుస్తోందని ప్రశ్నించారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే జగనన్న ఇళ్ల కాలనీలకు వేల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, వీటికితోడు గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా భవనాలకు ఎలా ఇసుక ను అందిస్తారని నిలదీశారు. వెంటనే మీ ప్రియమైన ఇసుక పాలసీ మార్చుకోండి అంటూ రఘురామ లేఖలో పేర్కొన్నారు.
కార్మికుల ఇసుకను కొనలేరా..?
ఇసుక పాలసీ వల్ల ఒకవైపు నిర్మాణదారులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఇసుకను తరలించే కార్మికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేపీ పవర్ వెంచర్స్ నిర్లక్ష్యం కారణంగానే ఉభయ గోదావరి జిల్లాలోని ఎంతోమంది ఇసుక కార్మికులు తమ ఉపాధిని కోల్పోతున్నారు. ఎంతో కాలంగా పడవల ద్వారా ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ కు కాంట్రాక్ట్ అప్పజెప్పడంతో.. కార్మికుల పరిస్థితి ఘోరంగా తయారైంది. కార్మికులు తెచ్చే ఇసుకను కొనకుండా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి, ఉభయ గోదావరి జిల్లాల ఇసుక కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Must Read ;-