No Masks And No social Distancing in Telugu States –
వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో.. కరోనా కేసులు తగ్గాయనే నిర్లక్ష్యమో.. కారాణాలు ఏమైతేనేం.. మళ్లీ కరోనా మహమ్మారి విరుచుపడుతోంది. మూడో వేవ్ ముప్పు ఉందని తెలిసినా 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. దీంతో చాపకింద నీరులా కొవిడ్ విస్తరిస్తోంది. జనాల నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు దారితీస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కడ చూసినా జనం గుంపుగుంపులుగా చేరి కనిపిస్తున్నారు. కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. అధికారులు అలర్ట్ చేస్తున్నా చీమకుట్టినట్టుగా కూడా లేదు.
కనీస జాగ్రత్తలేవీ?
అటు ఏపీ, ఇటు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేయడంతో మళ్లీ జనాల సందడి మొదలైంది. రాకపోకలు మొదలయ్యాయి. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. కానీ చాప కింద నీరులా మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభమైంది. అధికారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తుండట ఆందోళన కలిగిస్తోంది. ప్రజలే కాదు..రాజకీయ నాయకులు సైతం కొవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వాసాలమర్రిలో సహపంక్తి భోజనాలు చేయడం.. కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు దారితీసింది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నసభలు, సమావేశాల్లో కూడా కొవిడ్ నిబంధనలను పాటించడం లేదు. ఇక హుజూరాబాద్ లో అయితే నిర్లక్ష్యం కొట్టొచినట్టు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో 30 శాతం హుజూరాబాద్ నుంచే వస్తున్నాయి. అత్యధిక పాజిటివ్ రేటు నమోదవుతోన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఉంది. జూలైలో 3,500 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
నో బెడ్స్.. నో ఆక్సిజన్
వ్యాక్సిన్ వేగవంతం చేసినప్పటికీ కేసులు ఇంకా జీరోకి రాలేదు. అజాగ్రత్తగా ఉండటంతో కొవిడ్ విజృంభిస్తోంది. రెండు రాష్ట్రల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో మళ్లీ బెడ్లు, ఆక్సిజన్లకు కొరత ఏర్పడుతోంది. ఇప్పటికీ కొన్నిప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ స్థితికి రాని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్ లు, శానిటైజర్లు వాడటంతో పాటు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
Must Read ;- పిల్లులూ దాడి చేస్తాయ్ .. యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం