భారత క్రికెట్ మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ మరోసారి వివాదాస్పదంగా మారారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ లేకపోవడంపై అజహర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే! అప్పటి నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణతో ఆహజర్కు వివాదం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ లొల్లి మరింత ముదిరింది. అజహరుద్దీన్పై సీబీఐ విచారణ జరిపించాలని యెండల డిమాండ్ చేసేవరకూ వెళ్లింది.
అజహర్.. మ్యాచ్ ఫిక్సర్!
అజహరుద్దీన్పై హెచ్ సీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ సెలక్షన్లో అనేక అవకతవకలు జరిగాయని యెండల ఆరోపించారు. రంజీ క్రికెట్ ఎంపికల్లోనూ అవకతవకలు జరిగాయని తెలిపారు. అజహర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అది తాత్కాలిక అనుమతేనని పేర్కొన్నారు. అంతే తప్ప మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాల నుంచి అజహర్ తప్పించుకోలేడని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నేటికీ బీసీసీఐ క్లీన్ చీట్ ఇవ్వలేదన్నారు.
ఆ నిధులెక్కడికి పోయినట్టు?
హెచ్సీఏ అభివృద్ధికి అజహర్ చేసింది శూన్యమని లక్ష్మీనారాయణ ఆరోపించారు. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నట్టని ప్రశ్నించారు. మూడేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన రిపోర్టు సబ్మిట్ చేయడం లేదన్నారు. సీబీఐ కేసుల్లో ఉన్న వ్యక్తి.. క్రికెట్ అసోసియేషన్కు ఎలా న్యాయం చేస్తాడని అన్నారు. గత ముప్పై ఏళ్లలో ఒక్క గ్రామీణ క్రీడాకారుడు కూడా రంజీల్లో ట్రోఫీల్లో ఆడలేకపోయారని ఆరోపించారు. అజహర్ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని యెండల తెలిపారు.
Must Read ;- ఐపీఎల్ ఆతిథ్యానికి అవకాశమివ్వండి.. కేటీఆర్