వివేకా హా** జరిగి నేటికి సరిగ్గా అయిదేళ్లు.. మార్చి 15, 2019లో వివేకా హత్య జరిగింది.. నేటికి అయిదేళ్లు పూర్తి అయినా, అధికారంలో ఆయన అన్న కొడుకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా… ఇంతరకు నేరస్తులు ఎవరనేది తేల్చలేకపోయారు.. సీబీఐ ఎంక్వయిరీలో ఎలాంటి దూకుడు లేదు.. ఇటు కోర్టులోనూ ఆ అంశంపై వాయిదాల పర్వం నడుస్తోంది.. వివేకా హ**పై తాజాగా ఆయన బార్య సౌభాగ్యమ్మ చేస్తున్న ఆరోపణలు పెను సంచలనంగా మారుతున్నాయి.
వివేకాని చంపింది సొంత బంధువులే అని, ఇంటి దొంగలే తన భర్తని పొట్టనపెట్టుకున్నారని తాజాగా సంచలన ఆరోపణలు చేశారు భార్య సౌభాగ్యమ్మ.. ఇంటి దొంగలే తన భర్తని చంపారని తమకు తెలియడానికి కాస్త ఆలస్యం అయిందని ఆమె తెలిపారు.. తన భర్త హ**లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆయనకు తగిన శిక్ష పడాలని సౌభాగ్యమ్మ ఆరోపించారు.. రాజకీయ కారణాలతోనే వివేకాని చంపేశారని, అంతకుమించి ఆయనకు శత్రువులు లేరని కుండబద్దలు కొట్టారు..
తన భర్తను ఎవరు చంపారు, ఎలా చంపారనేది వైఎస్ జగన్, ఆయన భార్య భారతికి మొత్తం తెలుసని, అయినా వారు కాపాడుతున్నారని వాపోయారు.. తనకు న్యాయం చేయాలని కోరిన చెల్లి సునీతపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, చివరికి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సునీతపైనే అభాండాలు వేశారని ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు.. తన కూతురు సునీత.. తండ్రి హ**పై రాజీలేని పోరాటం చేస్తున్నారని, లేకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారేదని వివేకా భార్య సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు..
జగన్ పాలన బాలేదని, ప్రజా వేదిక కూల్చిన నాడే తనకు ఆయన పాలనపై ఒక అభిప్రాయం వచ్చిందని, ఇలాంటి పాలకుడు అవసరం లేదని, ఆయనని ఓడించాలని పిలుపునిచ్చారు సౌభాగ్యమ్మ.. వచ్చే ఎన్నికలలో మంచి పాలకుడు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. మొత్తమ్మీద, జగన్పై తీవ్ర విమర్శలు చేశారు పినతల్లి సౌభాగ్యమ్మ.. నేడో రేపో ఆమె తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేయనున్నారు.. దీని తర్వాత పులివెందులలో సీన్ ఎలా మారిపోతుందో చూడాలి..