YSR కాంగ్రెస్ పార్తీ గొడ్డలి గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుందా..అంటే అవుననే తెలుస్తోంది. వైసీపీది నిజానికి ఫ్యాన్ గుర్తు. కానీ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చం*పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. ఈ హ*త్య జగన్కు తెలిసే జరిగిందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో వైసీపీకి గొడ్డలికి అవినాభావ సంబంధం ఉందని టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తాయి. ఐతే ఇప్పుడు నిజంగానే వైసీపీ గొడ్డలి గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఈ మేరకు ఈసీకి లేఖ రాశారు. ఈ లెటర్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
YSRCP..అంటే సాధారణంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట పార్టీ పెట్టారనుకుంటారు. కానీ కాదు..అది యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఈ పార్టీని జగన్ ప్రారంభించలేదు. కె.శివకుమార్ అనే వ్యక్తి స్తాపించారు. శివకుమార్ది తెలంగాణలోని నల్లగొండ జిల్లా. స్వతహాగా న్యాయవాది. వైఎస్సార్కు అభిమాని. వైఎస్సార్ మర*ణం తర్వాత 2009లో ఈ పార్టీని స్థాపించారు శివకుమార్. 2011 ఫిబ్రవరి 1న పార్టీకి ఎన్నికల కమిషన్ నుండి రిజిస్ట్రేషన్ లభించింది. ఐతే ఈ పార్టీని జగన్ శివకుమార్ నుంచి లాక్కున్నారు. శివకుమార్కు మొదట్లో ఏదో చిన్న పదవులు ఇచ్చారు. తర్వాత ఆయనను పక్కనపెట్టేశారు. ఐతే తాజాగా శివకుమార్ తన పార్టీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని వ్యవస్థాపకుడి హోదాలో ఈసీకి లేఖ రాశారు.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. పార్టీలు అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ఆ నిబంధనలు ఎప్పుడూ పాటించలేదు. జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఐతే ఇది చెల్లదని ఈసీ స్పష్టం చేసింది. ఐనా వైసీపీ ఎన్నికలు నిర్వహించలేదు.
ఐతే ప్రస్తుతం శివకుమార్కు వైసీపీలో ఎలాంటి రోల్ లేదు. కానీ పార్టీలో అధ్యక్ష పదవి కోసం ఎలాంటి ఎన్నికలు జరగడం లేదు. దీంతో శివకుమార్ వైసీపీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. ఐతే శివకుమార్ లేఖను ఈసీ పరిగణలోకి తీసుకుంటుందా..లేదా అనేది ఆసక్తిగా మారింది.











