నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయవద్దంటూ ఎస్పీ భాస్కర్ భూషణ్ కింది స్థాయి అధికారులను ఆదేశించారని నల్లపురెడ్డి ఆరోపిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారు, నీవు ఎన్ని రోజులు ఉంటావ్ ఇక్కడ, నిన్ను మీ డీజీపీ కాపాడుతాడని అనుకుంటున్నావా? అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఓ సమావేశంలో నెల్లూరు ఎస్పీని హెచ్చరించిన వీడియో వైరల్ గా మారింది.
టీడీపీ ఏజంటుగా పనిచేస్తున్నావా?
టీడీపీ నాయకులు ఫోన్ చేసి అట్రాసిటి కేసు తీసుకోవద్దంటే వారి మాటే వింటావా? ముందు మా నాయకులు ఇచ్చిన కేసు నమోదు చేయండి. డీఎస్పీతో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. ఎస్పీ అనుమతిస్తేనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చట్టంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చావ్.. ఒకట్రెండు రోజులు ఉంటావ్.. తరవాత నీ బతుకేంది? – నువ్వు అసలు ఎవడివి అంటూ ఎస్పీపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి పరుషపదజాలం ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- పలాసలో టీడీపీ కార్యకర్త అదృశ్యం.. ఎంపీ నిరసన











