తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్ బాబాయ్.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ నిజమే అని ఒప్పుకొన్నారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశామని అంగీకరిస్తూనే.. కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. ఎన్డీడీబీ ల్యాబ్ టెస్టులో నెయ్యి కల్తీ జరిగిందని తేలింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు ఉన్నాయని రిపోర్టు స్పష్టం చేయడంతో.. ఇదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు.. కల్తీపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ.. అప్పుడే వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. అత్యున్నత న్యాయస్థానం సీబీఐ సారధ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
వైవీ సుబ్బారెడ్డి కోరిక ప్రకారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ నెయ్యి కల్తీ నిజమే అని తేల్చింది. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు టీటీడీకి నెయ్యి పేరుతో రసాయనాలు కలిపిన పామాయిల్ అంటగట్టారని ఆధారాలతో సహా అభియగపత్రం దాఖలు చేశారు. దీంతో ఆయన కూడా కల్తీ నిజమే అని ఒప్పుకోక తప్పలేదు. 10 శాతం కంటే తక్కువ స్థాయిలో పంది కొవ్వు కలిస్తే.. పట్టుకోగలిగే సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గర లేదని… నెయ్యి శాంపుల్స్ని పరీక్షించిన ఎన్డీఆర్ఐ సంస్థ తెలిపింది. గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాల కోసం అసలు పరీక్షలే జరపలేదు. సిట్ ఛార్జ్షీట్లో ఈ అంశాలన్నీ క్లియర్గా ఉన్నా.. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును నిందించే ప్రయత్నం చేశారు.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
వాస్తవానికి 2022లో వైసీపీ హయాంలో.. వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా ఉన్న సమయంలోనే.. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. నెయ్యి కల్తీపై నివేదిక ఇచ్చింది. స్వామి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేస్తున్నది కల్తీ నెయ్యి అని అప్పుడే తేలినా.. సీఎఫ్టీఆర్ఐ నివేదికను తొక్కిపెట్టి.. మరో మూడేళ్ల పాటు స్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ వచ్చారు. 2020లో నెయ్యి కొనుగోలు నిబంధనలు మార్చింది అప్పటి ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డే. ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చిన ఫేక్ డెయిరీకి కాంట్రాక్టులు కట్టబెట్టి.. ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిన్న అప్పన్న అసలు తన పీఏనే కాదని వాదిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి. అధికారులు, మధ్యవర్తుల పాత్రను బయటపెట్టిన సిట్.. అసలు సూత్రధారులను వదిలేసింది. దీంతో కల్తీ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్మైండ్స్ని పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.











