తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రముఖ ఆలయాలు పాక్షిక లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. కొన్ని స్వచ్చంధంగా మూసివేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ప్రముఖ క్షేత్రమైన యాదగిరి గుట్ట లో పదిరోజుల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ విధించనుంది. ఈ మేరకు యాదగిరిగుట్టలో నేటి నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్ డౌన్ ఉంటుంది. స్వచ్ఛందంగా షాపుల మూసివేతకు షాప్ ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ సూచించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.
ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల బడా పెట్టుబడి.. దటీజ్ చంద్రబాబు బ్రాండ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో...