వికారాబాద్ కల్తీ కల్లు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పోలీసుల రంగంలోకి దిగి వివిధ కోణాల్లో విషయాన్న దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మొదట ఏదో వింత రోగంగా భావించారు ప్రజలు.. ఆ తర్వాత కల్తీ కల్లు కారణమని తెలియడంతో.. అధికారులు ఆ దిశగా దర్వాప్తు చేపట్టారు.
కల్తీ కల్లు బాధితుల సంఖ్య 183కు చేరడంతో ప్రభుత్వం కాస్త సీరియస్ అయ్యింది. దర్యాప్తు చేపట్టి వెంటనే ప్రాధమిక నివేదిక అందించాల్సిందిగా అధికారులను, పోలీసులను ఆదేశించడంతో.. పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చిట్టిగిద్ద కల్లు డిపో సీజ్ చేశారు పోలీసులు. అంతేకాదు.. వికారాబాద్ నియోజకవర్గంలోకి కల్లు దుకాణాలను మూసివేయించారు. ఈ ఘటన వెనకాల ఏదైనా కుట్రదాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. . కల్లు సంఘాల మధ్య విభేధాల కారణంగా.. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనికి పాల్పడ్డారేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల. ఎవరైనా వ్యక్తుల చేసిన పనా అన్నట్లుగా కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆసుపత్రిలో జనాలు చేరుతుండడంతో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అందరికీ సకాలంలో వైద్యం అందించే విధంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Must Read ;- 15 నెలల చిన్నారిని కాపాడిన సోనూ సూద్..











