తిరుపతి వెళ్లే రైళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. మూడు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే తప్ప దొరకని పరిస్థితి ఉండేది. కానీ, కరోనా కారణంగా రైళ్లు పరిమితి సంఖ్యలో తిరుగుతుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎన్నో సమస్యలెదుర్కోంటున్నారు. అలాంటి వారికి శుభవార్త చెప్పింది రైల్వే సంస్థ. స్పెషల్ ట్రెయిన్స్ పట్టాలెక్కనున్నట్లు వెల్లడించింది. వాటి వివరాలిలా ఉన్నాయి..
ఈ నెల 7 నుంచి తిరుపతి-బిలాస్పూర్ ప్రత్యేక రైలు (07481) పునరుద్దరించనున్నట్లు రైల్వే సంస్థ పేర్కొంది. ఈ రైలు వారంలో 2 రోజులు.. ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 10:50 నుంచి తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 05:30 నిమిషాలకు బిలాస్ పూర్ చేరుకుంటుంది.. మధ్యలో విజయవాడ కూడా టచ్ అవుతుంది ప్రయాణికులకు సులభంగా ఉంటుంది. ఇదే ట్రైన్ (07482) బిలాస్ పూర్ నుంచి మంగళ, శని వారాల్లో అక్కడి నుంచి మధ్యాహ్నం 3.35గంటలకు బయలుదేరి.. మరురోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతికి చేరుకునే రోజు పొద్దున 11.55కి విజయవాడలో అందుబాటులోకి వస్తుంది.
తిరుపతి–పూరి మధ్య నడిచే స్పైషల్ రైలు (07479) ఈ నెల 8 నుంచి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది. ఈ ట్రైన్ ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరికి చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో (07480) ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరిలో బయలుదేరి.. రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
Must Read ;- తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల మూత..!











