శృతి హాసన్.. అనగనగా ఓ థీరుడు, ఓ మై ఫ్రెండ్.. చిత్రాలతో ఆకట్టుకోలేకపోయినా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ మూవీతో సక్సస్ సాధించింది. ఆతర్వాత బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు తదితర చిత్రాలతో విజయం సాధించింది. కెరీర్ సక్సస్ ట్రాక్ లో వెళుతున్న టైమ్ లో లవ్ లైఫ్ లో పడి.. నటనకు సుదీర్ఘంగా బ్రేక్ ఇవ్వడంతో ఈ అమ్మడు క్రేజ్ కోల్పోయింది.
ఇలాంటి టైమ్ లో శృతిహాసన్ మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. నామినల్ రెమ్యూనరేషన్ కే ఈ సినిమాకి సైన్ చేసింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. క్రాక్ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ మూవీలో కూడా నటించింది. ఈ సినిమాలో పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. నటించేందుకు ఓకే చెప్పింది. అయితే.. శృతికి అనుకోకుండా సాలర్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటించేందుకు రెగ్యులర్ గా ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా 50 లక్షలు ఎక్కువుగా డిమాండ్ చేసిందట. అయితే.. ఈ సినిమాకి ఎక్కువ రోజులు డేట్స్ కావాల్సివుండడం.. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి మేకర్స్ శృతి డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే.. శృతి కెరీర్ కి మరింతగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అదే జరిగితే.. రెమ్యూనరేషన్ విషయంలో పూజా హేగ్డేకి సమానంగా డిమాండ్ చేయచ్చు. శృతిహాసన్ మళ్లీ టాప్ లీగ్ లోకి రావాలి అనుకుంటుంది. మరి.. సాలర్ శృతి కెరీర్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ సరసన శృతిహాసన్? ఏ సినిమాలో?