దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు, జీఎస్టీ, ఎలక్ట్రానిక్ వే బిల్లులకు నిరసనగా దేశ వ్యాప్తంగా 40 వేల వ్యాపార సంస్ధలు స్వచ్ఛందంగా భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాపార, వాణిజ్య సంస్ధలు మూతపడ్డాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు.
గత కొద్ది రోజులుగా.. పెట్రోలు, గ్యాస్ ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. వీటిపై ఆగ్రహించిన వ్యాపార సంస్థలు.. ధరల పెరుగుదల, జీఎస్టీ.. ఇలా పలు అంశాలను నిరసనగా దాదాపు 40,000 వ్యాపార సంస్ధలు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. కానీ, లేదని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపార్ మండల్, భారతీయ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ సంస్ధలు.. తాము బంద్ లో పాల్గొనడం లేదని ముందుగానే ప్రకటించాయి.
Must Read ;- కొండెక్కుతున్న పెట్రోలు ధరలు.. బండెక్కలేకపోతున్న సామాన్యులు