అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమకారులు ఒక్కొక్కరుగా రెచ్చిపోతున్నారు. తాజాగా వరంగల్ లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన అర్షం స్వామి ఓ ఫ్లెక్సీ కట్టారు. ‘టీఆర్ఎస్ కు ఓటు వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా.. వీలైతే మీ ఇష్టం’ అంటూ ఫ్లెక్సీ పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండటం, ఈ ఫ్లెక్సీ వైరల్ కావడం టీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ ఈ ఫ్లెక్సీ వివాదస్పదం కూడా అవుతోంది.
Must Read ;- ఆయనకు తెలియకుండానే పొత్తులు.. బండి సంజయ్ ఏకాకి అవుతున్నారా?