మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధా అనే కీలక పాత్ర పోషిస్తుండడంతో ఎప్పుడెప్పుడు ఆచార్య సినిమాను చూస్తామా అని అభిమానులు ఎదురు ఆతృతగా చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం.. లాక్ డౌన్ ఎత్తేయడంతో షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించారు.
ఈ విషయాన్ని ఈ రోజు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. ఈ సినిమాలో సిద్ధ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ న్యూ స్టిల్ ను కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా.. త్వరలో ఎగ్జైట్మెంట్ అప్ డేట్ ఇవ్వనున్నట్టుగా కూడా తెలియచేశారు. తాజా సమాచారం ప్రకారం.. 12 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 7 రోజుల పాటు జరిగే షూటింగ్లో రామ్చరణ్ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీన్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆచార్య విడుదల ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం.
చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మూవీని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆచార్య విడుదల ఎప్పుడు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
Must Read ;- అటు ఆచార్య .. ఇటు అఖండ;