మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. సామాజిక అంశాలకు తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాలి కానీ.. పలు కారణాలతో లేట్ అవుతూనే ఉంది. ఫైనల్ గా సమ్మర్ లో ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోతే ఈ పాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. దాదాపుగా షూటింగ్ఇ పూర్తయ్యింది. ఓ 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఇటీవల కొరటాల వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. సమ్మర్ రిలీజ్
మిస్ అయ్యింది కాబట్టి ఈ చిత్రానికి తదుపరి మంచి సీజన్ అంటే దసరా అనే చెప్పాలి కానీ అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా లేదా అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
ఈ సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగి ఇంకాస్త ఆలస్యం అయితే.. మాత్రం ఆచార్య వచ్చే ఏడాది సంక్రాంతి ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు స్టార్ హీరోలను టెన్షన్ పెడుతుంది. కారణం ఏంటంటే.. సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే నాగార్జున కూడా బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ విధంగా ఆచార్య స్టార్ హీరోలను టెన్షన్ పెడుతుంది. మరి.. ఆచార్య విడుదల పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
Must Read ;- ‘ఖైదీ’ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ సినిమా ?