యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు కొరటాల శివ. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రాలను తెరకెక్కించి.. వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించారు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే… ఏమైందో ఏమో కానీ.. కొరటాల శివ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను.. తన అభిప్రాయలను సోషల్ మీడియా ద్వారా పంచుకునేవారు. ఇక పై సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ఓ ప్రకటన ద్వారా తెలియచేశారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో భారీ చిత్రం చేయనున్నారు. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పడం ఆసక్తిగా మారింది.
ఇదే విషయం గురించి అడిగితే.. ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వలన సమయం ఉండడం లేదు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే.. తన సినిమాలకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా తెలియచేస్తుంటాను. ఈ విధంగా అందుబాటులో ఉంటాను అని చెప్పారు.
must read ;- ఎన్టీఆర్ మూవీలో విజయ్ సేతుపతి