కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకీ పెరుగుతోన్న కేసులతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. రోజుకి లక్షల్లో కేసులు వస్తుండడం, వేలల్లో మరణాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడంతో పాటు.. కరోనా టీకా తీసుకోవడం కూడా తప్పని సరి అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు కోరోనా టీకా సెండ్ డోస్ తీసుకుంటున్నారు. వారిలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ఉన్నారు.
క్రిందటి నెల్లో మోహన్ బాబు తిరుపతిలో కరోనా ఫస్ట్ డోస్ టీకా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా తెలియజేశారు. తాజాగా మోహన్ బాబు తాను కరోనా వేక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంటున్న సంగతి కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, తప్పని సరిగా వేక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మోహన్ బాబు డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘సన్నాఫ్ ఇండియా’ అనే సందేశాత్మక చిత్రంలో నటిస్తున్నారు.
Must Read : ‘సన్ ఆఫ్ ఇండియా’ కోసం మోహన్ బాబు ప్రయోగం!
https://twitter.com/themohanbabu/status/1386166343037177857











