కరోనా అంతటా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రతిఒక్కరినీ విడిచిపెట్టడం లేదు. గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను సైతం కరోనా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ఛోటా రాజన్. అయితే ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీహార్ జైలు వర్గాలు ఛోటా రాజన్ కు టెస్టు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను జైలులోని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు.
Must Read : శ్రుతి ప్రేమికుడి కుంచె నుంచి కమల్ విశ్వరూపం











