ఆకట్టుకొనే అభినయానికి, ఆకర్షించే అందానికి కేరాఫ్ అడ్రెస్ రష్మికా మందన్న. ఇటు గ్లామర్ షోను , అటు పెర్పార్మెన్స్ ను సమపాళ్ళలో రంగరించగల సుందరాంగి ఆమె. శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు మైగ్రేట్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఇక్కడ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. పనిలో పనిగా.. కోలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది. అయితే వీటితో పాటు రష్మికా బేబ్.. బాలీవుడ్ లోనూ పాగా వేసే పని పెర్ఫెక్ట్ గా చేస్తోంది.
ఇప్పటికే రష్మికా మందన్న బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’లో కథానాయికగా నటిస్తోంది. అలాగే.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ బాయ్ లో ఆయన కూతురుగా నటిస్తోంది. ఇక దీంతో పాటు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేస్తున్నట్టు స్వయంగా ఆమెనే వెల్లడించింది.
ఇటీవల ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ సెషన్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రష్మికా తన బాలీవుడ్ మూడో ప్రాజెక్ట్ గురించి తెలిపింది. అయితే ఎవరి సినిమాలో అన్నది మాత్రం రివీల్ చేయలేదు. కన్నడ , తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ.. సత్తా చాటుకుంటున్న రష్మికా మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకోవడమే కాకుండా.. పుష్ప, చెర్రీ శంకర్ కాంబో లాంటి పాన్ ఇండియా మూవీస్ లో సైతం నటిస్తూండడం చెప్పుకోదగ్గ విషయమే. మరి అమ్మడి బాలీవుడ్ జెర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.
Must Read ;- ఆహా.. కార్తి ‘సుల్తాన్’ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది!











