కన్నడ కస్తూరి రష్మికా మందన్న ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ లో సైతం .. అమ్మడు కేవలం స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తోంది. ఈ క్రమంలో రష్మికా మందన్న బాలీవుడ్ లో ‘మిషన్ మజ్నూ’ అనే సినిమాలో కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే… రష్మికా బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపికై .. అందరినీ ఆశ్చర్యపరిచింది. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు ముందుగా ‘డెడ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ఈ మూవీకి ‘గుడ్ బాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఈ నెల 29న ‘గుడ్ బాయ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీని కోసం ముంబైలో ఓ ప్రత్యేకమైన సెట్ నిర్మిస్తున్నారట. అమితాబ్ బచ్చన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తూండగా.. ఆయన కూతురుగా రష్మికా మందన్న నటించబోతోంది. ఈ సినిమా కోసం రష్మికా ఏకంగా రూ. 5కోట్లు పారితోషికం అందుకుంటోందట. 1970ల్లో సాగే కథ గుడ్ బాయ్ అని తెలుస్తోంది. తండ్రి, కూతుళ్ళ ఎమోషనల్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే సినిమా ఓవరాల్ గా లైఫ్ కామెడీ మూవీగా రూపొందనుందట. మరి ఈ సినిమాతో రష్మికా మందన్నకి బాలీవుడ్ నుంచి ఇంకెన్ని ఆఫర్స్ వచ్చిపడతాయో చూడాలి.
Must Read ;- సినీ రంగాన్ని ‘సుల్తాన్’గా దున్నేస్తున్న రష్మిక










