ఓ ద్రావణం అంటే రకుల్ కు ప్రీతికరమట. అందుకే ఆ ద్రావణాన్ని అదే పనిగా తాగేస్తుందట. అందరూ కరోనాపై కోపంతో ఊగిపోతుంటే పాపం.. రకుల్ మాత్రం వేసవి తాపంపై వీడియోలు షేర్ చేస్తోంది. అందులో ఈ ద్రావణం కూడా ఒకటి. ఎండలు పేట్రేగిపోతుంటే ఏంచేయాలో ఈ అమ్మడు మంచి సలహాలే ఇస్తోంది. అందుకు సోషల్ మీడియా కూడా మంచి వేదికైంది. షూటింగులు లేవు కదా.. ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా జనానికి ఎలా ఉపయోగపడాలో రకుల్ ను చూసి నేర్చుకోవచ్చు.
సాధారణంగా ఎండలకు వడ దెబ్బ తగిలి మన శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటప్పుడు నీళ్లు, చెరకు రసం, నిమ్మరసం లాంటివి అందరూ వాడుతుంటారు. ఇవేవీ కాకుండా కొత్త ద్రావణాన్ని రకుల్ పరిచయం చేయడం విశేషమే. ‘పేరు చిన్నదే అయినా పనిలో మాత్రం చాలా పెద్దది’ అంటూ కితాబిస్తోందామె. వేసవి తాపం చల్లార్చాలంటే బార్లీ ద్రావణం మమ్మల్ని రక్షిస్తుంది అంటూ ఆమె సూచిస్తోంది. ఓ న్యూటిషన్ తనకు ఈ ద్రావణాన్ని తాగమని చెప్పారట.
ఇదంతా ఎందుకు చల్లని బీరు తాగినా బార్లీయే కదా అంటూ కామెంట్లు చేస్తున్నవారూ ఉన్నారండోయ్. ఏదేమైనా రకుల్ మాటను మనం జవదాటకుండా బార్లీ ద్రావణం ఎలా ఉంటుందో రుచి పోతుంది కదా. కరోనా సమయంలోనూ ఆమె సినిమాలు చేసేస్తూ బిజీగానే ఉంది. కొండపొలం నవల ఆధారణంగా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ రూపొందిస్తున్న సినిమాలో ఆమె నటిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న సినిమా, బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ల సినిమాలు చేస్తోంది రకుల్.
Must Read ;- మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ అల్లరి హంగామా!











