యాంకర్ అనసూయ ‘క్షణం, కథనం’ లాంటి సినిమాల తర్వాత నటించిన మరో థ్రిల్లర్ మూవీ ‘థ్యాంక్ యూ బ్రదర్’. అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాని కొత్త దర్శకుడు రమేశ్ రాపర్తి తెరకెక్కించాడు. జస్ట్ ఆర్టినరీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో ‘థ్యాంక్ యూ బ్రదర్’ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ డేట్ కలిగిన పోస్టర్ ను రివీల్ చేసి.. చిత్ర యూనిట్ కు విషెస్ అందించాడు. ఈ సినిమాలో ఇంకా వైవా హర్షా, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆస్తికరంగా ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఒక లిఫ్ట్ లో నిండు గర్భిణి, ఒక యువకుడు వెళుతుండగా.. సడెన్ గా లిఫ్ట్ స్ట్రక్ అయిపోతుంది. తనతో పాటు అందులో ఆ యువకుడు తప్ప వేరే ఎవరూ లేని ఆ సమయంలో ఆమెకు నొప్పులు ప్రారంభమౌతాయి. ఆ పరిస్థితుల్లో ఆమెకోసం ఆ యువకుడు ఏం చేశాడు అనేదే సినిమా కథాంశం. మరి ఈ సినిమా అనసూయకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!
#ThankYouBrother really interesting trailer with a totally new concept ! Got me hooked .. The film will be out April 30th congratulating @Raparthy for ur directorial debut & best wishes to the team @anusuyakhasba @viraj_ashwin @MaguntaSarath @JustOrdinaryEnt @ahavideoIN pic.twitter.com/7n9ulOhj7r
— chaitanya akkineni (@chay_akkineni) April 17, 2021











