గుంటూరులోని జీజీహెచ్లో ఆశా వర్కర్స్ యూనియన్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్గా పనిచేస్తున్న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆశా వర్కర్ల యూనియన్ కలెక్టర్ను నిలదీశారు. దీంతో కోపగించన కలెక్టర్ ఆశా వర్కర్ల యూనియన్ నేతలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.
19న టీకా తీసుకున్న విజయలక్మి
ఈనెల 19న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె కుటుంబీకులు చెప్తున్నారు. హఠాత్తుగా అస్వస్థతకు గురవ్వడంలో జీజీహెచ్లో చేర్పించినట్లు చెప్తున్నారు కుటుంబ సభ్యులు. చికిత్స తీసుకుంటూ ఈరోజు విజయలక్ష్మి మృతి చెందడంతో.. ఆశా వర్కర్ల యునియన్, కుటుంబ సభ్యులు జీజీహెచ్ వద్ద ధర్నా చేపట్టారు. వ్యాక్సిన్ వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ.. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళకు దిగారు. కానీ జీజీహెచ్ సూపరింటిండెంట్ వాదన మరోలా ఉంది.. బ్రెయిన్ డెడ్ కారణంగానే విజయలక్ష్మి మృతి చెందినట్లు చెప్తున్నారు.
ఆశా వర్కర్ల ఆందోళన
ఆశా వర్కర్ల యూనియన్ నేతల కలెక్టర్తో చర్చించారు. విజయలక్ష్మి మృతికి రూ. 50 లక్షల పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతానని కలెక్టర్ శామ్యూల్ హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో యూనియన్ నేతలు ఆందోళనను విరమించారు. కలెక్టర్ శామ్యూల్ హామీపై నమ్మకం లేదని మృతురాలు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పరిహారం అందే వరకు ఇక్కడే ఉంటామని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచిన టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. టీడీపీ నేత పిల్లి మాణిక్యరావుపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తీరుపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్కు అస్వస్థత











