బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ విజయంతో టీమిండియా మంచి జోష్ మీద ఉంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న జరిగే తొలి టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ను సైతం సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకింగ్లో తిరుగులేని జట్టుగా స్థిరపడి పోవాలని టీమిండియా భావిస్తోంది. ఆసీస్పై విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత్ను దెబ్బకొట్టాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లూరుతోంది. ఇంతకీ భారత్ – ఇంగ్లండ్ పర్యటనలో పైచేయి ఎవరిది?
27 నుంచి బయో బబుల్లోకి..
భారత్, ఇంగ్లండ్ సిరీస్ను కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఇరు జట్ల ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేస్తున్నారు. భారత క్రికెటర్లంతా ఈ నెల 27న బయో బబుల్లోకి ప్రవేశిస్తారు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ న్యూజిలాండ్ నుంచి ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. ఇంగ్లండ్ జట్టు మాత్రం శ్రీలంకతో సిరీస్ తర్వాత కొలంబో నుంచి ఈ నెల 27న ఇక్కడికి వచ్చి నేరుగా హోటల్లోకి ప్రవేశిస్తారు.
ప్రేక్షకులకు అనుమతి!
టీమ్ ఇండియా వచ్చే నెల 5 నుంచి ఇంగ్లాండ్తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. మ్యాచ్లను చూసేందుకు స్టేడియాల్లోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మిగతా రెండు అహ్మదాబాద్లో జరగనున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆ దేశ బోర్డు అనుభవాలను బీసీసీఐ అడిగి తెలుసుకోనుంది.
Must Read ;- క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త.. భారత్-పాక్ సమరం అనుమానమే!
4 మ్యాచ్ల టెస్టు సిరీస్
ఇంగ్లండ్తో జరుగనున్న నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభం.
వేదికలు: చెన్నై, అహ్మదాబాద్
చెన్నై(ఎంఏ చిదంబరం స్టేడియం)లో ఇరు జట్ల మధ్య తొలి రెండు టెస్టు మ్యాచ్లు జరుగనున్నాయి.
మూడో టెస్టు(డే అండ్ నైట్), నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది.
తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9, చెన్నై(ఉదయం 9.30కు ప్రారంభం)
రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, చెన్నై(ఉదయం 9.30కు ప్రారంభం)
మూడో టెస్టు(డే/నైట్): ఫిబ్రవరి 24-28, అహ్మదాబాద్(మధ్యాహ్నం 2.30కు ప్రారంభం)
నాలుగో టెస్టు: మార్చి 4-8, అహ్మదాబాద్(ఉదయం 9.30కు ప్రారంభం)
ఐదు టీ20 మ్యాచ్లు అక్కడే!
భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు అహ్మదాబాద్ ఆతిథ్యం అందించనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. ఇక ఇక్కడ కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో 5 టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.
తొలి టీ20: మార్చి 12, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: మార్చి 14
మూడో టీ20: మార్చి 16
నాలుగో టీ20: మార్చి 18
ఐదో టీ20: మార్చి 20
మూడు వన్డేలు
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న మూడు వన్డేల సిరీస్కు పుణె వేదిక కానుంది.
తొలి వన్డే: మార్చి 23 (మధ్యాహ్నం 1.30కు)
రెండో వన్డే: మార్చి 26
మూడో వన్డే: మార్చి 28
తొలి రెండు టెస్టులకు భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్
తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టు
జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, బెన్స్టోక్స్, ఓలీ స్టోన్, డామ్ సిబ్లే, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జేమ్ అండర్సన్.
Also Read ;- భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్స్