కరోనాను కట్టడిచేసే టీకా ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూసిన రోజులకు తెరపడే సమయం దగ్గరపడుతోంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 4-5 టీకాలు ఏకకాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వాడకానికి ఎమర్జెన్సీ సర్వీస్ కింద అనుమతులు కూడ లభించడం ఆశాజనకంగా కనిపిస్తుంది. కానీ, కొందరిలో దుష్ప్రభావాలు కనిపించడం ఆందోళన కలిగిస్తున్న విషయమనే చెప్పాలి. వీటితో పాటు ప్రజల దృష్టంతా టీకాల సామర్థ్యం, ధర, పనితీరుపై ఉంది. ఒకవేళ వీటిన్నంనిటినీ దాటి కరోనా టీకా సిద్ధమైనా, ప్రపంచల దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు వాటిని దేశంలోని ప్రజలకు అందించడం. టీకా కనిపెట్టడం ఒకెత్తైతే, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పెను సవాలుగా మారింది. మరి ప్రపంచ దేశాల ప్రణాళికలెలా ఉన్నాయో చూద్దాం.
ముందుకొచ్చిన 90 ఏళ్ల మహిళ
ప్రపంచవ్యాప్తంగా టీకాలు ప్రయోగదశను దాటి మెల్లగా అనుమతులు అందుకుంటున్నాయి. అందులో ఫైజర్ అన్నింటికంటే ముందంజలో ఉందని చెప్పచ్చు. అమెరికా, యుకే, కెనడా వంటి దేశాలు ఫైజర్ టీకా ఉపయోగానికి అనుమతులు లభించాయి. ఇప్పటికే యుకేలో ఫైజర్ టీకాను 90 ఏళ్ల మహిళతో ప్రారంభించారు. కానీ, ఫైజర్ టీకా కారణంగా, 4-5 గురు విషయంలో పాక్షికంగా ముఖానికి సంబంధించిన పక్షవాతం సమస్యలు తలెత్తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ఫైజర్ ఇవ్వద్దంటూ ఇప్పటికే ఎన్ హెచ్ ఎస్ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఫైజర్ సామర్థ్యం, రక్షణ విషయంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఫైజర్ తర్వాత ఆక్స్ ఫర్డ్ టీకా కొవీషీల్డ్ మంచి జోరుమీదుందని చెప్పచ్చు. ఫైజర్ తోపాటు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెన్ కాలు రూపొందించిన కొవిషీల్డ్ కు అనుమతులు లభించాయి. కొవీషీల్డ్ ని ఉపయోగంలోకి తేవడానికి యుకే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఫైజర్ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కొవీషీల్డ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో ఉంది యుకే ప్రభుత్వం.
Must Read ;- వ్యవసాయ కుటుంబం నుంచి వ్యాక్సిన్ల తయారీదారుడిగా..
తిరస్కరించిన భారత్
యుకేలో అనుమతులు లభించిన నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా ఎమర్జెన్సీ అనుమతుల కోసం సీరమ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. వీటితోపాటు ఫైజర్, దేశీయ వ్యాక్సిన్ గా పేరు గాంచిన భారత్ బయోటెక్ టీకా కోవ్యాక్సిన్ కూడా దరఖాస్తు చేసుకుంది. కానీ ప్రయోగాలకు సంబంధించిన డేటా మొత్తం అనుమతులలో నమోదు చేయని కారణంగా భారత్ మెడిసెన్ సంస్థ కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాల దరఖాస్తును తిరస్కరించింది. కానీ, యుకేలో కొవిషీల్డ్, ఫైజర్ టీకా ఫలితాలు అనుకున్నట్లుగా నమోదైతే, భారత్ కూడా అనుమతులు అందించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే, కొవిషీల్డ్ అధికారకంగా భారత్ లో ఉపయోగించడానికి అనుమతులు లభించినట్టే. ఇక ఫైజర్ కు అనుమతులు లభించినా, అది భారత్ కు చేరే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నందున ఫైజర్ కోసం భారత్ ఎదురుచూడక తప్పదనే చెప్పాలి.
జోరుగా ఏర్పాట్లు
టీకాల వాడకం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటిని నిల్వ ఉంచడానికి, ప్రజలకు అందించడానికి భారీ ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగంగా 28,947 కొల్డ్ చెయిన్ సర్వీసులను ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా 85,643 పరికరాలు దేశవ్యాప్తంగా సిద్ధం చేసింది ప్రభుత్వం. మొదటి దశలో దాదాపు 3 కోట్ల మంది డాక్టర్స్, కరోనా వర్కర్స్ కు అందివ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీళ్లతో పాటు 30 కోట్ల మంది ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వారికి వ్యాక్సిన్ ని ఎలా అందించాలి, రాష్ట్రాలకు తరలించే విషయంలో కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
డిసెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టీకాలు అన్ని ప్రాంతాలకు తరలించడంతోపాటు, అక్కడ టీకాను నిల్వుంచడానికి గిడ్డంగులు లాంటివి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు వాటిని ఎలా అందించాలి, ఎవరికీ ముందు అందించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి.
Must Read ;- ఈ టాబ్లెట్ 24 గంటల్లో కరోనాను కట్టిడి చేస్తుంది