భీమా కోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టైన వరవరరావుకు బెయిల్ మంజూరైంది. మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే అభియోగాలతో వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ.. వరవరరావుతోపాటు పాటు, మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్లను పుణే పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.
అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్నాళ్ల పాటు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం గౌతమ్ నవలాఖాకు నిర్బంధం నుంచి కోర్టు విముక్తి కల్పించగా, నవంబర్లో మిగతా నలుగురిని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్న వరవరరావకు నేటికి బెయిల్ మంజూరైంది.
Must Read ;- గ్రెటా థన్బర్గ్ టూల్కిట్ కేసులో కీలక మలుపు.. మొదలైన అరెస్టుల పర్వం..